సత్యదేవ్ గాడ్సే ట్రైలర్ టాక్..!

యువ హీరో సత్యదేవ్ లీడ్ రోల్ లో గోపీ గణేష్ పట్టాభి డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్సే.

సీకే స్క్రీన్స్ బ్యానర్ లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో సత్యదేవ్ సరసన మళయాళ భామ ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది.ఆమె తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే.ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.సత్యమేవ జయతే.

ధర్మో రక్షితి రక్షత: అని అంటారు.కానీ సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదని అని పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ వచ్చింది.

అవినీతి రాజకీయ నాయకుల మీద ఓ వ్యక్తి చేసిన పోరాటమే గాడ్సే కథ.కంటెంట్ ఉన్న కథతో మరోసారి సత్యదేవ్ తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.పవర్ ఫుల్ డైలాగ్స్ తో గాడ్సే ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తి కలిగించేలా చేసింది.

Advertisement

జూన్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.ఈ సినిమాతో పాటుగా సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు