అవి మహిళల కనీస అవసరాలు.. ఆ రిపోర్ట్ పై సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్( Hema committee report ) పై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా ఈ రిపోర్టుపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది.

ఈ మేరకు ఆ రిపోర్ట్ పై సమంత స్పందిస్తూ.కేరళలోని వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌( Women in Cinema Collective ) అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను.

దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది.పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి.

సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాలు.అయినా వీటికోసం ఇప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు.వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

Advertisement

ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అని సమంత పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సమంత( Samantha ) కెరియర్ విషయానికి వస్తే మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపించిన సమంత ఈ మధ్యకాలంలో మళ్లీ కాస్త డల్ అయ్యిందని చెప్పాలి.ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఈ మధ్యకాలంలో సమంత సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు.

సమంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించకపోయేసరికి అభిమానులు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మరి ముందు ముందు అయినా సమంత తన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తుందేమో చూడాలి మరి.

ఈ ఇద్దరు అనవసరం తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారా..?
Advertisement

తాజా వార్తలు