సమంత కు జాంబీ రెడ్డి సినిమాకు సంబంధం ఏంటో అతి త్వరలో క్లారిటీ!

ఇంద్ర సేనా రెడ్డి మూవీ లో బాల నటుడిగా కనిపించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇప్పటికే కొన్ని సినిమాల్లో కనిపించిన తేజ ప్రస్తుతం జాబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.

ఈ వారంలో విడుదల కాబోతున్న జాబీ రెడ్డి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ప్రమోషన్‌ కార్యక్రమాలు చూస్తుంటే అర్థం అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంతను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కలిశాడట.ఒక కథను చెప్పి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడట.

ఆ కథ జాంబీల నేపథ్యంలో ఉంటుంది.జాంబీ రెడ్డి తరహాలోనే సమంతతో ఒక సినిమా చేయాలని అందులో కూడా జాంబీలు ఉంటాయని అంటున్నారు.

Advertisement

ఈ జాంబీలు ఏంటీ అనేది ప్రేక్షకులకు క్లారిటీగా తెలియదు కనుక సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే ఉద్దేశ్యంతో సమంత ఆ సమయంలో ప్రాజెక్ట్‌ కు నో చెప్పిందట.తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు తేజలు మాట్లాడుతూ మా సినిమా సక్సెస్ అవ్వడం ఖాయం సీక్వెల్‌ లో సమంత నటించడం ఖాయం అంటున్నారు.

ఇప్పటికే సమంతను కథతో ఒప్పించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ త్వరలోనే ఆమె తో మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉంది.జాంబీ రెడ్డి సక్సెస్ అయితే సమంత ఇదే ఏడాదిలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.జాంబీ రెడ్డి సినిమా సూపర్‌ హిట్‌ అయితే జాంబీ రెడ్డి 2 సినిమా చేయడం, ఆ సినిమా లో సమంత కీలక పాత్రలో కనిపించడం పక్కా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమా ఫలితం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సమంత అభిమానులు కూడా ఈ సీక్వెల్‌ ను కోరుకుంటున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు