మీడియా ముందుకు వస్తున్న సాయి ధరమ్ తేజ్..!

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరం తేజ్ పబ్లిక్ లోకి రాలేదు.

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద బైక్ స్కిడ్ అవడం వల్ల సాయి ధరం తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

దాదాపు నెల రోజుల దాకా అపోలో హాస్పిటల్ లో ఉంచి ట్రీట్ మెంట్ అందించారు.ప్రస్తుతం సాయి ధరం తేజ్ బాగానే ఉన్నాడు.

అయితే అభిమానుల కోసం మీడియా ముందుకు రావాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్.చిన్నపాటి సర్జరీ అనంతరం కోలుకున్న సాయి ధరం తేజ్ అంతా సెట్ రైట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక తను హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా డిజిటల్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో సాయి ధరం తేజ్ పాల్గొంటాడని తెలుస్తుంది.రిపబ్లిక్ థియేటర్ రిలీజ్ టైం లో ప్రమోషన్స్ చేయలేకపోయిన సాయి ధరం తేజ్ డిజిటల్ రిలీజ్ టైం లో సినిమాకు సపోర్ట్ గా ఉండాలని చూస్తున్నాడు.

Advertisement

అంతేకాదు ఆఫ్టర్ యాక్సిడెంట్ మొదటిసారి మీడియా ముందుకు వస్తున్న సందర్భంగా అసలు ఆరోజు ఏం జరిగింది అన్న విషయాలను కూడా తేజ్ ప్రస్థావిస్తారని తెలుస్తుంది.ఇక సాయి ధరం తేజ్ చేయాల్సిన సినిమాలన్ని 2022 కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు