మెగా హీరో నుండి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడును చూపిస్తున్నాడు.ఆ మధ్య వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలు పడటంతో సబ్జెక్టు ఎంచుకోవడంలో కాస్త ఆలోచిస్తున్నాడు.
ఇక ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు దేవా కట్టా డైరెక్షన్లో తరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను పెట్టారు చిత్ర యూనిట్.
ఇక పూర్తిగా పొలిటికల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ చిత్ర యూనిట్ నుండి ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
‘పంజా అభిరామ్ జిల్లా కలెక్టర్’ అనే నేమ్ బోర్డుతో ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.అంటే ఈ సినిమాలో తేజు కలెక్టర్ అభిరామ్ పాత్రలో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడన్నమాట.
ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా నటిస్తున్నాడు.
పొలిటికల్ మైండ్ గేమ్ చిత్రంగా దేవా కట్టా ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో మనకు తెలియాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, భగవాన్-పుల్లారావులు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ కానున్న రిపబ్లిక్, పబ్లిక్కు ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.