Sai Dharam Tej : మీడియా ప్రతినిధికి అలాంటి ఆన్సర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఇది ఆ తరహా చిత్రం కాదంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష( Virupaksha ).ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.

కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వం వహించిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.90 దశకంలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదల అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.ఇది ఇలా ఉంటే చిత్ర యూనిట్ ఒక మీడియా సమావేశం నిర్వహించగా అందులో ఒక ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది.అదేమిటంటే విరూపాక్ష చిత్రానికి ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సాయిధరమ్ తేజ్ ని ప్రశ్నిస్తూ.విరూపాక్ష చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు.

Advertisement

మీకు సంయుక్త మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయా లేక భయానక సన్నివేశాలు ఉండడం వల్లనా అని ప్రశ్నించారు.ఆ ప్రశ్నల పై స్పందించిన సాయి ధరమ్ తేజ్.

మీడియా ప్రతినిధితో జోకులు వేస్తూ ఇది మీరు అనుకుంటున్నట్లు ఆ తరహా సినిమా కాదు.కానీ ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎగ్జైట్ చేస్తుంది.కానీ మీరు అనుకున్న విధంగా ఎగ్జైట్ చేయదు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

తేజు సమాధానం విన్న సంయుక్తా మీనన్ పడి పడి నవ్వుతూ కనిపించింది.ఆ వెంటనే దర్శకుడు కార్తీక్ దండు స్పందిస్తూ.ఈ సినిమాలో వణుకు పుట్టించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.

అలాగే టెన్షన్ పెట్టే సన్నివేశాలు కూడా ఉన్నాయి.అందువల్లే ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

ఇది ఫ్యామిలీ మొత్తం కలసి చూడాల్సిన చిత్రం అని చెప్పుకొచ్చారు కార్తీక్ దండు.

Advertisement

తాజా వార్తలు