తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్,( Sachin Tendulkar ) టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ( Vinod Kambli ) ఇద్దరు కలుసుకున్నారు.వీరిద్దరూ కూడా వారి గురువు అయిన కోచ్ దివంగత రమాకాంత్ అచ్రేకర్ జయంతి సందర్భంగా కలుసుకున్నట్లు సమాచారం.
ముంబై నగరంలోని( Mumbai ) చత్రపతి శివాజీ మహారాజ్ పార్కులో ఆవిష్కరణ జరిపారు.ఈ వేడుకలలో వినోద్ కాంబ్లీ, సచిన్ తోపాటు పలువురు హాజరైనట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా.గత కొన్ని రోజులుగా వినోద్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.
ఒకరి సపోర్టు లేకుండా అతను సొంతంగా నడవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాడు.ఇటీవల కాలంలో ఆయనను నడిపించేందుకు ఇబ్బంది పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
కాంబ్లీ అనారోగ్యానికి గురైన అనంతరం తొలిసారిగా బహిరంగంగా సచిన్ కలిశాడు.చిన్ననాటి స్నేహితుడిను( Childhood Friend ) ఒక్కసారిగా ఇలా వేదికపై కలవడంతో కాంబ్లీ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది.సచిన్ కంటే ముందే కాంబ్లీ వేదికపై కూర్చొని ఉండగా అనంతరం స్టేజ్ పైకి వచ్చిన సచిన్ తన ఫ్రెండ్ అక్కడే ఉన్నట్లు గమనించి వెంటనే కాంబ్లీ వద్దకు వెళ్లి పలకరించాడు.ఈ క్రమంలో సచిన్ చేయిని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకోవడంతో ఎంతకీ వదలకపోవడంతో పక్కన ఉన్న వ్యక్తి సచిన్ చేయని విడిపించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.1990లో అంతర్జాతీయ క్రికెట్ లో కాంబ్లీ మేటి ఆటగాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.సచిన్ టెండూల్కర్ కంటే చాలా ప్రతిభావంతుడుగా ఆటగాడుగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు కాంబ్లీ.ఈ తరుణంలో 2013లో గుండెపోటుకు గురి అవ్వగా వైద్యుల సర్జరీ నిర్వహించారు.అనంతరం యాంజియోప్లాస్టీ తర్వాత కోరుకున్నప్పటికీ, అనంతరం ఇతర అనారోగ్య సమస్యలతో ఎప్పటికప్పుడు అతడు అనారోగ్యాలకు గురి అవుతూనే ఉన్నాడు.