కేసీఆర్ బయోపిక్ మీద దృష్టిపెట్టిన వర్మ... త్వరలో సెట్స్ పైకి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తనలో ఉన్న గొప్ప దర్శకుడుని పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత రివెంజ్ తీర్చుకోవడానికి, ఎక్కువగా తనని తాను మార్కెట్ చేసుకోవడానికి అన్నట్లు సినిమాలు చేస్తున్నాడు.

ఒకప్పుడు వర్మ సినిమా అంటే కంటెంట్ ఎలా ఉన్న టెక్నికల్ గా దర్శకుడు కావాలనుకునే ప్రతి ఒక్కరు అతని సినిమాలు చూడాలని అనేవారు.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఆర్జీవి సినిమా అంటే అందులో ఏ వివాదాస్పద అంశాన్ని కెలుకుటున్నాడో, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అనే విషయాలు మాట్లాడుకుంటున్నారు.

ఇక సినిమా రిలీజ్ కి ముందు కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తున్న రిలీజ్ తర్వాత తుస్సుమంటుంది.లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ బీరాలు పలికి సినిమాని రిలీజ్ చేసిన వర్మ దానిని భాగానే మార్కెట్ చేసుకున్నాడు.

అది థియేటర్ లోకి వెళ్ళాక విషయం లేని సినిమా అని తేలిపోయింది.తాజాగా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ జగన్ ని హీరోగా చూపిస్తూ చేసిన సినిమాకి ముందు పబ్లిసిటీ భాగా సంపాదించిన రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా ఫ్లాప్ అంటే టాక్ వచ్చేసింది.

Advertisement

అతని గత సినిమాలన్నింటి కంటే ఇది డిజాస్టర్ మూవీ అని ప్రేక్షకులు తేల్చేసారు.ఇదిలా ఉంటే ఆ మధ్య కేసీఆర్ బయోపిక్ అంటూ టైగర్ అని టైటిల్ పెట్టి ఒక పోస్టర్ వదిలాడు.

ఇప్పుడు దానికి బూజు దులిపే పనిలో వర్మ ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కథ మీద తన టీమ్ తో వర్క్ చేయిస్తున్నాడని, అలాగే టీఆర్ఎస్ పార్టీ నేతలతో కథ గురించి చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక నవాజుద్దీన్ సిద్ధిఖ్ ని ఇందులో కేసీఆర్ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేసారని టాక్ వినిపిస్తుంది.ఆర్జీవి త్వరలో ఈ సినిమా ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు