జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.తారక్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతుంటే వద్దని మరి కొందరు సూచిస్తున్నారు.
ఆర్జీవీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే లోకేశ్ పని అయిపోతుందని కామెంట్లు చేశారు.టీడీపీని కాపాడటానికి వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని వర్మ చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశానికి సమస్య అని 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు పరోక్షంగా చెప్పాడని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో టీడీపీకి తాను మెయిన్ అని చంద్రబాబు భావించారని వర్మ పేర్కొన్నారు.
అప్పుడు వారసత్వం తన కొడుకుకు ఇస్తాడే తప్ప జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన అవసరం ఏముందని వర్మ కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ వెరీ బిగ్ సూపర్ స్టార్ అని వర్మ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యమా కొడుకు ముఖ్యమా అని ఆలోచించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో లోకేశ్ కు పాపులారిటీ రావాలని తండ్రి కల అని వర్మ వెల్లడించారు.సరైన సమయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నారని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీఆర్ ముందుపోటు పొడుస్తాడని వర్మ తెలిపారు.నాకు చనిపోయిన వాళ్లను చూడటం ఇష్టం ఉండదని వర్మ అన్నారు.
చనిపోయిన వ్యక్తి మళ్లీ లేవడని అందుకే వెళ్లనని ఆర్జీవీ వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాలిటిక్స్ విషయంలో తన ఆలోచనలను వెల్లడించలేదు.ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా తారక్ పోస్ట్ లు చేయడం లేదు.జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన స్పష్టత కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాల పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.