తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 18 పార్టీలు బహిష్కరిస్తే.
కేసిఆర్ మాత్రం అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు.రైతు చట్టాల విషయంలో మోడీ ఒళ్లో కూర్చుని రైతు ద్రోహిగా కెసిఆర్ మిగిలిపోయారని మండిపడ్డారు.
కొత్త చట్టాలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అంటూ స్పష్టం చేశారు.రైతుల నైతికతను దెబ్బతీసి మోడీ.కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని, రైతులకు అండగా నిలవాల్సిన ఇలాంటి సమయంలో వాళ్లకు వ్యతిరేకంగా కేసిఆర్ వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి భారీ డైలాగులు వేశారు.
దేశవ్యాప్తంగా రైతులకు క్లారిటీ వచ్చిందని .వాళ్ల పక్షాన ఎవరు ఉన్నారో వారికి అర్థమవుతుంది ఎవరు లేరు అన్న దాని విషయంలో కూడా వాళ్లకి క్లారిటీ వచ్చింది అని తెలిపారు.
.