రాజ్ కుంద్రా అరెస్ట్ వెనుక ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజాలు

ప్రముఖ బాలీవూడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అంతర్జాతీయ స్థాయిలో అశ్లీల రాకెట్ ను నడిపడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇక పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు వెలువడుతున్నాయి.కాగా.

తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులు అనేక విషయాలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.అయితే ఈ అశ్లీల రాకెట్ కేసులో కొత్తగా తెరపైకి యష్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ పేరు బయటికి వచ్చింది.

ఇక తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.అంతేకాదు.

తనపై బెదిరింపులకు పాల్పడి కొందరు డబ్బు లాగేశారని ఆరోపణలు చేశారు.ఇక ఈ కేసులో తాను బాధితుడిని అంటూ యష్ థాకూర్ ముంబై పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇక మరోవైపు యష్ తరుఫున కోర్టులో ఆయన తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నా క్లయింట్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు.దాంతో వాటిని ఆన్ ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు.

అంతేకాక.రాజ్ కుంద్రా కేసును జస్టిస్ అజయ్ గడ్కరీ బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు.ఇక ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణాపాయ్ పలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని.భారత చట్టాలకు వ్యతిరేకంగా సినిమాలను నిర్మించారని తెలిపారు.

కానీ.ఒకవేళ వాటికి నిరూపించగలిగితే నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పాయ్ వెల్లడించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కాగా.ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రెండు యాప్ ల నుంచి 51 అశ్లీల సినిమాలను స్వాధీనం చేసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు.అయితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రాజ్ కుంద్రా అతడి బావ ప్రదీప్ బక్షి చేసిన నేరాలు తీవ్రమైనవని తెలిపారు.

అంతేకాక.ఈ కేసులో రాజ్ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ కోర్టు నిరాకరించింది.

అయితే ఇప్పటికే 14 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెబ్ పోర్టల్స్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

తాజా వార్తలు