ప్రచారమా...రాజకీయ కోణామా!!

ఒకప్పుడు ముఖానికి రంగులు వేసుకునే వారు.రాజకీయాలకు ఎందుకు పనికొస్తారు అని అనేవారు.

కానీ ఇప్పుడు పార్టీలన్నీ ఆ రంగులు వేసుకున్న వారినే ఏరీ కోరి.అడిగింది ఇచ్చి, కోర్కెలు తీర్చి మారీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.ఇప్పుడు హీరో శివాజీ విషయం మాత్రం ఒకింత డిఫరెంట్.

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో.కమల దళంలో అడుగుపెట్టిన శివాజీ.

Advertisement

ఇప్పుడు సామాజిక అంశాలపై బాగా స్పందిస్తున్నాడు.ఆ మధ్య వోల్వో బస్సు దహనం సమయంలోనూ ఆ తర్వాత ఒకటి రెండు ఘటనల్లో సామాజికంగా స్పందించాడు.

ఇప్పుడు మోడీ స్వచ్ఛభారత్ కు బాగా ప్రచారం చేస్తున్నాడు.తన సొంత నియోజకవర్గంగా భావించే చిలకలూరిపేటలో కూడా.

స్వచ్ చిలకలూరిపేట అనే ప్రోగ్రామ్ నిర్వహించాడు.అందులో భాగంగానే.

మరుగుదొడ్ల అవసరం.అనారోగ్యానికి బహిరంగ మల విసర్జన ఎలా కారణమవుతుందనే విషయాలపై బాగానే స్పీచ్ దంచాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

బాగా ఫీలయ్యాడేమో ఆవేశంగా మాట్లాడాడు.అసలు బయట మల, మూత్ర విసర్జన చేసేవాళ్లను జైల్లో పెట్టేలా చట్టాలు చేయాలన్నాడు.

Advertisement

అదే వేదికపై మంత్రులు కూడా ఉండేసరికి.పనిలో పనిగా చంద్రబాబుపైనా ప్రశంసలు కురిపించాడు.

చంద్రబాబు తలచుకుంటే స్పేస్ ను కూడా నేలకు దింపుతాడన్నారు.ఆయన ఒక్కడుంటే చాలు స్టేట్ పరుగులు పెడుతుందని ధీమాగా చెప్పాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ.ఈ ఆవేశం.

ప్రజల పై అభిమానమా.లేక పదవి పై వ్యామోహమా అన్నది ఆయనకే తెలియాలి.

తాజా వార్తలు