మాస్ మహరాజ్ రవితేజ తో శృతి హాసన్ ఇదివరకు రెండు సినిమాల్లో నటించింది.ఆ సినిమాలు కూడా బలుపు, క్రాక్.
రెండు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన సినిమాలే అవడం విశేషం.ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఆ సినిమాలో శృతి హాసన్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడి పాత్రలో నటిస్తున్నారు.
సో అలా చూస్తే శృతి హాసన్ పాత్ర రవితేజకి వదిన అన్నమాట.
బలుపులో శృతి ప్రేయసిగా చేయగా.
గోపీచంద్ మలినేని క్రాక్ లో భార్యగా చేసింది శృతి హాసన్.ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో మాత్రం వదినగా నటించింది.
రవితేజతో ఇలా ఏ హీరోయిన్ కూడా చేసి ఉండకపోవచ్చని చెప్పొచ్చు.తెలుగులో అనూహ్యంగా శృతి హాసన్ క్రేజ్ పెరిగింది.
వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలతో పాటుగా సలార్ తో కూడా సత్తా చాటుతుంది శృతి హాసన్.మరి ఈ 3 సినిమాలతో అమ్మడు మునుపటి ఫాం లోకి వచ్చేలా ఉంది.
టాలీవుడ్ లో శృతి హాసన్ ఛాన్స్ లను చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.