పొద్దున లేవగానే నీళ్ళు తాగలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.ఎందుకంటే 7-8 గంటలు విశ్రాంతి తీసుకున్న తరువాత మన శరీరం డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
నీళ్ళు తాగడం వలన మళ్ళీ శరీరం హైడ్రేట్ అవుతుంది.అలాగే రోజు ప్రొద్దున్నే నీళ్ళలో కాసింత ఉప్పు వేసుకోని తాగితే మరిన్ని లాభాలున్నాయి.
ఆవేంటో చూద్దాం.
* సాల్ట్ వాటర్ యాంటి బ్యాక్టీరియాగా పనిచేస్తుంది.
ఇది మీ శరీరంలో ఉన్న మలినాలను తీసేయ్యడంలో సహాయపడుతుంది.
* సాల్ట్ వాటర్ షుగర్ పేషెంట్స్ కి వరం లాంటిది.
ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది.డయాబెటిస్ తో బాధపడేవారు సాల్ట్ వాటర్ ని క్రమం తప్పకుండా రోజు తాగితే ఇది షుగర్ ట్రీట్మెంటులో ఎంతగానో ఉపయోగపడుతుంది.
* సాల్ట్ వాటర్ ఆసిడిటిని కూడా నివారిస్తుంది.
* సాల్ట్ వాటర్ లో కాల్షియం మంచి మోతాదులో లభిస్తుంది.
ఇది ఎముకలకు బలాన్ని అందిస్తుంది.
* కోర్టిసోల్, అడ్రెనలైన్ అనే రెండురకాల హార్మోన్లు ఒత్తిడికి కారణమవుతాయి.
వీటిని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది సాల్ట్ వాటర్.అలాగే మంచి నిద్రను కూడా అందిస్తుంది.
* సాల్ట్ వాటర్ లో క్రోమియం మరియు సల్ఫర్ బాగా దొరుకుతుంది.చర్మ అరోగ్యానికి ఇవి సహాయపడతాయి .
* సాల్ట్ వాటర్ వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.