ఈసారి ఫుల్లు కిక్కు ఇవ్వబోతున్న మాస్ రాజా!

మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ఖిలాడీ ఒకటి.రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా తెరకెక్కుతుంది.

ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక ఇప్పుడు ఖిలాడీ నుండి మరొక సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ సినిమా నుండి నాలుగవ సింగిల్ త్వరలోనే రాబోతుంది.

రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈ సినిమా లోని స్పెషల్ ఫోక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ పాట ఫుల్లు కిక్కు అంటూ సాగుతుందని విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలిపారు.మరి ఈ సాంగ్ ఫోక్ సాంగ్ కాబట్టి ఇందులో హీరోయిన్స్ ఇద్దరు చిందేస్తారా.లేదంటే ఒక్కరే కనిపిస్తారా.

లేదా స్పెషల్ హీరోయిన్ తో ఏమైనా చేయిస్తారా అనే విషయం తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాల్సిందే.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక ఈ సాంగ్ ను దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ తో పాటు రవితేజ కూడా గొంతు కలిపినట్టు తెలుస్తుంది.మరి ఈ సాంగ్ తో రవితేజ ప్రేక్షకులకు ఫుల్లు కిక్కు ఎక్కిస్తాడో లేదో చూడాలి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా ఫిబ్రవరి 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు.మరి కరోనా తగ్గుముఖం పట్టి అంత బాగుంటే అనుకున్న సమయానికే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు