సీఎంకు పీఏగా మారబోతున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరో

రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

ఫ్యాన్స్‌ పర్వాలేదు అంటే ప్రేక్షకులు మాత్రం ఇదేం సినిమారా బాబు అంటున్నారు.సరే ఫలితం ఏంటో కాని డిస్కోరాజా టైం అయిపోయింది.

ఇప్పుడు క్రాక్‌ టైం నడుస్తోంది.గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ పోలీస్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

మే లో ఈ చిత్రం రాబోతున్నట్లుగా అప్పుడే ప్రకటన వచ్చింది.

Advertisement

క్రాక్‌ చిత్రం ఇటీవల ప్రకటన వచ్చిందో లేదో అప్పుడే రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం రవితేజతో రమేష్‌ వర్మ చర్చలు జరుపుతున్నాడట.వీరిద్దరి కాంబోలో గతంలో వీర అనే చిత్రం వచ్చింది.

ఆ సినిమా నిరాశ పర్చింది.ఆ చిత్రంలో రవితేజ చాలా విభిన్నంగా కనిపించాడు.

కాని కథ పట్టు లేకపోవడంతో సినిమా నిరాశ పర్చింది.అయితే వీరిద్దరు మరోసారి జత కట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక సీఎం పీఏ అయిన హీరో అవినీతికి పాల్పడితే ఎలా ఉంటుంది, అతడికి ఉండే ప్రత్యేకమైన పవర్స్‌ ఏంటీ అనేది చూపిస్తూ సినిమాను తెరకెక్కించబోతున్నారట.సీఎం పీఏగా రవితేజ కనిపించబోతున్నాడట.కథలో భాగంగా రవితేజ కొంత సమయం సీఎంగా కూడా అవుతాడు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

మొత్తానికి రవితేజ ఈ చిత్రంతో కుమ్మేస్తాడా లేదంటే కుదేలవుతాడా చూడాలి.

Advertisement

తాజా వార్తలు