టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన రష్మీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సినిమాలు, ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే షోల ద్వారా ఈ స్టార్ యాంకర్ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
మూగజీవులను ప్రేమించే రష్మీ వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని పంచుకోవడంతో పాటు తన మనస్సులోని బాధను వెల్లడిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.
తాజాగా రష్మీ ఆవు, గేదెను ఈడ్చుకుని వెళుతున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఇండియాలో ఉన్న దరిద్రం ఇదేనని చెప్పుకొచ్చారు.
ఇండియాలో ఆవును గోమాత అని పిలుస్తారని మరోవైపు మనం జంతువుల చర్మాలతో తయారు చేసిన లెదర్ వస్తువులను వినియోగిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.మనం రోజూ తాగే పాలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకోవాలంటూ రష్మీ నెటిజన్లకు సూచనలు చేశారు.

జంతువులను హింసించకుండా తయారయ్యే వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కామెంట్లు అయ్యారు.సోషల్ మీడియా వేదికగా రష్మీ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.రష్మీ చేసిన వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుంటే మరి కొందరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు.రష్మీ గతంలో కూడా మూగజీవుల గురించి చేసిన పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ప్రతివారం ప్రోమోలో టీఆర్పీ స్టంట్స్ చేస్తూ ఈ షోపై అంచనాలు పెంచడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.
జబర్దస్త్ స్థాయిలో కాకపోయినా పరవాలేదనే స్థాయిలో ఈ షో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.రష్మీ టీవీ షోల ద్వారా తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.