అవి అంటే ఎంతో ఇష్టమని చెబుతున్న యాంకర్ రష్మీ!

టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన రష్మీ గౌతమ్ ఒకవైపు బుల్లితెర షోలలో యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే రష్మీ చాలా సినిమాల్లో నటించినా గుంటూరు టాకీస్ మినహా మరే సినిమా హిట్ కాలేదు.

మరోవైపు అనసూయ మాత్రం యాంకర్ గా నటిస్తూనే సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకుంటోంది.దీంతో రష్మీ కూడా సక్సెస్ సొంతం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం రష్మీ నందు హీరోగా తెరకెక్కుతున్న "బొమ్మ బ్లాక్ బస్టర్ " సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కాగా ఇందులో రష్మీ గొడవలు అంటే ఇష్టపడే పాత్రలో నటిస్తోంది.హీరో నందూతో తనకు గొడవలు జరుగుతుంటే చూడటం ఎంతో ఇష్టమని చెబుతోంది.

Advertisement

అల్లరి అమ్మాయిగా చిలిపి తగాదాలు పెట్టే పాత్రలో రష్మీ తొలిసారి కనిపించబోతుంది.ఈ సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలో చేరుతుందని రష్మీ భావిస్తోంది.

సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సినిమాల్లో నటిస్తున్నా సరైన గుర్తింపు రాదనే భావనలో ఉన్న రష్మీ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో చేరితే మరికొన్నేళ్లు హీరోయిన్ గా రాణించాలని భావిస్తోంది.

మరి నందుతో నటిస్తున్న బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రష్మీ ఆశలు నెరవేస్తుందో లేదో చూడాల్సి ఉంది.హీరోగా నటిస్తున్నా సరైన విజయం దక్కకపోవడంతో నందు కూడా ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు