తమిళ దర్శకుడుతో పాన్ ఇండియా మూవీ కన్ఫర్మ్ చేసిన రానా

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కెరియర్ ని చాలా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో తమిళ దర్శకుడుతో అరణ్య మూవీ కంప్లీట్ చేశాడు.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే ఆపసోపాలు పడి రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమాకి కరోనా రూపంలో ఆటంకం ఏర్పడింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు.రెగ్యులర్ కమర్షియల్ జోనర్ జోలికి వెళ్ళకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్న రానా విరాటపర్వం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది.

Advertisement

సురేష్ ప్రొడక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే రానా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సురేష్ మూవీస్ బ్యానర్, మరో నిర్మాత ఆచంట గోపీనాథ్ కలిపి ఈ సినిమాను నిర్మిస్తాయి.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నారు.

తమిళ దర్శకుడు మిళింది రావ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.గతంలో ఆయన గృహం అనే హర్రర్ సినిమాతో ఈ దర్శకుడు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇప్పుడు రానాతో యాక్షన్ అడ్వంచరస్ కథని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా విజువల్ గ్రాండియర్ ఉండబోతుందని తెలుస్తుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఇదిలా ఉంటే మరోవైపు మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో కూడా నటించడానికి రానా సిద్ధమై ఉన్నాడని టాక్ నడుస్తుంది.మరి వీటిలో దేనిని ముందుగా పట్టాలు ఎక్కిస్తాడు అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు