ఆ పాత్ర కోసం శివగామి బాగానే డిమాండ్ చేస్తుందంటగా....

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రలయినా, విలన్ పాత్రలయినా, హీరోయిన్ అయినా, ఏదైనా సరే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయి తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసేటువంటి సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని వారుండరు.

ఈమె ఒకప్పుడు దాదాపుగా టాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.

అయితే ఈ మధ్య కాలంలో వయసు పెరగడంతో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.తాజాగా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది.

ఇటీవలె బాలీవుడ్ లో ఘన విజయం సాధించినటువంటి "అందాధున్" అనే చిత్రాన్ని తెలుగులో  హీరో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా అంధాదున్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన టబు పాత్రలో రమ్యకృష్ణ ని తెలుగులో నటింపజేయాలని చిత్ర యూనిట్ సభ్యులు యోచనలో ఉన్నట్లు సమాచారం.

అంతేకాక ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయం గురించి రమ్యకృష్ణ ను సంప్రదించగా భారీగానే పారితోషకాన్ని డిమాండ్ చేస్తోందట.దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు రమ్యకృష్ణను తీసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో పడినట్లు సమాచారం.

Advertisement

అయితే మరోపక్క ఈ చిత్రంలో టబు పాత్రలో నటించేందుకు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ పేరు కూడా వినిపిస్తోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రమ్యకృష్ణ టాలీవుడ్ లో మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ హీరోగా నటిస్తున్నటువంటి "సోలో బ్రతుకే సో బెటర్" అనే చిత్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. .

Advertisement

తాజా వార్తలు