మళ్లీ రాబోతున్న కందిరీగ కాంబో

యంగ్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

ఈ సినిమాతో సక్సెస్ కోసం పడిగాపులు కాచిన రామ్, తన ఆకలిని పూర్తిగా తీర్చుకున్నాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీ ‘రెడ్’ను ఇప్పటికే రెడీ చేశాడు.ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఆడియెన్స్‌లో క్రియేట్ అయ్యింది.కాగా ఈ సినిమా తరువాత రామ్ మరోసారి తనకు అదిరిపోయే హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ అనే డైరెక్టర్‌తో జతకట్టనున్నాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కందిరీగ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా రామ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.

Advertisement

అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంతోష్ శ్రీనివాస్, రామ్ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట.

ఈ సినిమాకు రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి కందరీగ కాంబో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు