పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగావకాశాలు ...

ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటక్ష‌న్ స్పెష‌ల్ ఫోర్స్‌ (ఆర్పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి నిర్ణీత వయసులో ఉన్న స్త్రీ, పురుషులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.జనవరి 1 నుంచి 30 వరకు అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* రైల్వే కానిస్ట‌ేబుల్ (యాన్సిల్ల‌రీ): 798 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు.విభాగం పోస్టుల సంఖ్య వాటర్ క్యారియర్ - 452 సఫాయ్‌వాలా - 199 వాషర్ మ్యాన్ - 49 బార్బర్ - 49 మాలీ (గార్డెనర్) - 07 టైలర్ (గ్రేడ్ 3) - 20 కాబ్లర్ (గ్రేడ్ 3) - 22 మొత్తం పోస్టులు - 798 అర్హ‌త‌: పదోతరగతి/ మెట్రిక్యులేష‌న్/ ఎస్ఎస్ఎల్‌సీ ఉత్తీర్ణ‌త‌.నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.వయోప‌రిమితి: 01.01.2019 నాటికి 18 - 25 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.రైల్వేశాఖ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

Advertisement

ద‌ర‌ఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా ఎంపిక‌ విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

రూ.500.ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్, మ‌హిళ‌లు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.పేస్కేలు: వాటర్ క్యారియర్, సఫాయ్‌వాలా, వాషర్ మ్యాన్, బార్బర్, మాలీ (గార్డెనర్) పోస్టులకు రూ.21,700 ప్రారంభ వేతనంగా.టైలర్, కాబ్లర్ పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనంగా ఇస్తారు.ఇతర భత్యాలు కూడా అందుతాయి.

రాతపరీక్ష విధానం:

✼ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి.వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజినింగ్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.

✼ ప్రతి ప్రశ్నలకు ఒకమార్కు.పరీక్ష సమయం 45 నిమిషాలు.

✼ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి.ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు (0.33) మార్కులు కోత విధిస్తారు.✼ మొత్తం 15 భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

✼ పరీక్షలో 35 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం) మార్కులు సాధిస్తేనే తదుపరి దశకు అర్హత సాధిస్తారు.

ముఖ్యమైన తేదీలు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం 01.01.2019 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది 30.01.2019 ఆన్‌లైన్ రాతపరీక్ష ఫిబ్రవరి/ మార్చి 2019.

Advertisement

తాజా వార్తలు