వైసీపీ పై రఘురామ సర్వే ? ఫలితం ఇదేనట ?

ఏదో ఒక రూపంలో వైసీపీ పై పగ సాధిస్తూనే ఉన్నారు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసిపి ఎంపీలు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్న, బిజెపి పెద్దలను కలుస్తూ ఫిర్యాదులు చేస్తున్న, రఘురామ మాత్రం ఎక్కడ భయపడడం లేదు.

ఏపీ ప్రభుత్వ వ్యవహారాలన్నీ ప్రజల ముందు ఉంచుతూ, తానే వైసిపికి అసలు సిసలైన ప్రత్యర్థి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ వ్యవహారం లోతుగా అధ్యయనం చేస్తూ , వాటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను బయట పెడుతూ కలకలం సృష్టిస్తున్నారు.

అయిన రఘురామని కంట్రోల్ చేయలేక వైసిపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఇక వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రఘురామకృష్ణంరాజు పై విమర్శలు చేస్తూ,  ఆయన వెనక్కి తగ్గేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, రఘురామ మాత్రం మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

తాజాగా ఓ సర్వే వ్యవహారం లో  రఘురామ వైసిపి లో సంచలనం సృష్టించారు.  తాను ఏపీ వ్యాప్తంగా టెలిఫోన్ సర్వే చేయించానని, ఆ సర్వేలో వైసిపి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే కనీసం 50 సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేదంటూ ప్రకటించారు.

Advertisement

అంతేకాక తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని, చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని , ఇంకెవరు గెలిచే పరిస్థితి లేదని రఘు రామ చెప్పుకొచ్చారు.

 అంతేకాదు నర్సాపురం నియోజకవర్గంలో జగన్ కంటే తనకే 90% ప్రజాదరణ ఉంది అంటూ చెప్పుకొచ్చారు.అయితే తాను ఈ సర్వే వివరాలను బయట పెట్టాలని అనుకోలేదు కానీ,  వైసిపి ఎంపీలు అదేపనిగా తనపై విమర్శలు చేస్తున్న క్రమంలో ఈ సర్వేను బయట పెట్టాల్సి వచ్చింది అంటూ ఆయన ప్రకటించారు.అయితే రఘురామ నిజంగానే సర్వే చేయించారా లేక వైసిపి చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ విధంగా సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏదిఏమైనా రఘురామ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సంచలన సృష్టిస్తూనే వస్తున్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు