నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి తీర్చిదిద్దుతున్నాడు.
ఇక ఈ సినిమాతో అటు బాలయ్య, ఇటు బోయపాటి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్నారు.కాగా ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ ఆయనకు కథలు వినిపించగా, వారికి బాలయ్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.అయితే గతంలో బాలయ్యతో కలిసి ఫుల్టూ ఎంటర్టైనర్ మూవీగా ‘పైసా వసూల్’ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పూరీ జగన్నాథ్, మరోసారి బాలయ్యతో అలాంటి సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.
తనను పూర్తిగా కొత్త అవతారంలో చూపించిన పూరీతో ఖచ్చితంగా మరో సినిమా చేస్తానని గతంలోనే బాలయ్య తెలిపాడు.దీంతో ఈ కాంబోలో మరో తేడా సింగ్ ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఇటీవల బాలయ్య కోసం పూరీ ఓ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే బాలయ్యను కలిసి ఆ కథను వినిపించి ఓకే చేయించేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరీ, ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేసేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.ఇక ఈసారి కూడా బాలయ్యను ఫుల్టూ ఎంటర్టైనింగ్ పాత్రలో చూపించేందుకు పూరీ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా మరోసారి తేడా సింగ్ను తీసుకొచ్చేందుకు పూరీ రెడీ అవుతుండటంతో, ఈసారి ఎలాంటి రచ్చ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.