బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్న డాషింగ్ డైరెక్టర్ !

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా తీసే విధానం అంటే అందరికి ఇష్టం.ఆయన వర్కింగ్ స్టైల్ హీరోలకు కూడా నచుతుంది.

పూరీ తన సినిమాను తొందరగా పూర్తి చేస్తాడు.ఎంత పెద్ద హీరో అయినా రెండు నెలల్లోనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకోగల సత్తా పూరీలో ఉంది.

అందుకే ఆయనను టాలీవుడ్ ముద్దుగా డాషింగ్ డైరెక్టర్ అంటారు.

ఇప్పుడు పూరీ వర్కింగ్ స్టైల్ నచ్చి కరణ్ జోహార్ పూరీని బాలీవుడ్ లో కొనసాగాలని కోరారట.పూరీ ఇంతకు ముందే బాలీవుడ్ లో అమితాబ్ తో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత మళ్ళీ సినిమా చేయాలనీ చుసిన వర్కౌట్ అవ్వలేదు.

Advertisement

మళ్ళీ ఇన్ని రోజులకు లైగర్ సినిమాతో బాలీవుడ్ లో పూరి పేరు మరు మోగిపోతుంది.లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుంటే.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో పూరీ తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

అందుకే కరణ్ ఆయన పూరీ వర్కింగ్ స్టైల్ నచ్చి ఆయన ప్రొడక్షన్ లో మరి కొన్ని హిందీ సినిమాలు చేయాలనీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో పూరీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.చూడాలి మరి కరణ్ జోహార్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ ను పూరీ జగన్నాథ్ ఎంత మేరకు ఉపయోగించుకుని హిట్స్ కొడతాడో.

Advertisement

తాజా వార్తలు