టుస్సాడ్ లో ప్రియాంక చోప్రా మైనపు బొమ్మ...కొలతలు తీసుకున్న టుస్సాడ్స్ సిబ్బంది

సెలబ్రిటీల మైనపు బొమ్మలు మేడం టుస్సాడ్ మ్యూజియం లో పెడుతుండడం ఇప్పుడు కామన్.

ఈ లిస్ట్ లో ఇప్పటికే షారూఖ్, అమితాబ్, మోడీ వంటి ప్రముఖుల మైనపు బొమ్మలతో పాటు ఇటీవల ప్రభాస్,మహేష్ బాబుల మైనపు బొమ్మలు ఆ మ్యూజియం లో కొలువుదీరిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మైనపు విగ్రహాన్ని పెట్టేందుకు మేడం టుస్సాడ్ రెడీ అయ్యింది.ఇటీవల హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ కు వివాహం చేసుకున్నాక ప్రస్తుతం న్యూయార్క్ లోనే సెటిల్ అయిన సంగతి తెలిసిందే.

నిక్ ని పెళ్లి చేసుకున్న తరువాత అక్కడే సెటిల్ అయి పలు టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిపోయింది.ఇదిలా ఉంటె, ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం కొలతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.2017 వ సంవత్సరంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో గోల్డెన్ లాంగ్ గౌన్ లో ఉన్న ప్రియాంక ఫోటోను మైనపు బొమ్మగా తయారు చేస్తున్నట్లు సమాచారం.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు