కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది.కీర్తి తల్లి తండ్రులు కూడా సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు సంబందించిన వాళ్ళే.
అందుకే కీర్తి సినిమా రంగప్రవేశం కూడా చాలా ఈజీగా జరిగింది.తెలుగులోకి నేను శైలజ చిత్రంతో అడుగు పెట్టింది ఆ చిత్రంలోని ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో తెలుగులో వరస అవకాశాలు ఆమె వెంట పడ్డాయి.
ఆ తర్వాత నాని తో నేను లోకల్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రాలలో నటించింది.ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సినిమాతో ఒక్కసారిగా కీర్తి సురేష్ పేరు మారు మోగిపోయింది.
అప్పటి నుండి కీర్తి లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో ఛాన్స్ లు వస్తే వదులుకోవడం లేదు.ఆ సినిమా బేస్ చేసుకొని మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలు వచ్చాయి.
ఈ రెండు చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యాయి.కానీ ఈ చిత్రాలు నిరాశ పరిచాయి.
ఈ చిత్రాలు కూడా లేడి ఓరియెంటెడ్ మూవీస్.మిస్ ఇండియా చిత్రం కోసం కీర్తి ఏకంగా తన బరువు మొత్తం తగ్గించుకుంది.ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖి అనే చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం అదిపినిశెట్టి, జగపతి బాబు లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం జూన్ 3వ తేదీన విడుదల అవ్వుతుంది.
కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుంది.ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తో సర్కారు వారి పాట అనే చిత్రంలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.కీర్తి సురేష్ వరస ఫ్లాప్స్ తో వస్తున్న తరుణంలో ఆ ఎఫెక్ట్ సర్కారు వారి పాట పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
గుడ్ లక్ సఖి తో మరోసారి హిట్టు కొడితే మాత్రం మహేష్ సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల అవ్వనున్నది.
ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్న కీర్తి సురేష్ ఈ రెండు చిత్రాలపై చాలా నమ్మకం పెట్టుకుంది
.