‘ప్రతిరోజూ పండగే’లో అదే అసలు ట్విస్టు

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ప్రతి రోజూ పండగే’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడటంతో ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసిన దర్శకుడు మారుతి, క్లైమాక్స్‌ను మాత్రం ఎవరి ఊహలకు అందని విధంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఎమోషన్స్‌ను ఒక్కసారిగా మార్చే క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.అయితే ఈ ట్వి్స్టు ఏమిటనేది మాత్రం చిత్ర యూనిట్ ప్రస్తుతం రివీల్ చేయడం లేదు.

మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Advertisement

ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు మెగా ఫ్యాన్స్.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు