బెడిసికొట్టిన శ్రీముఖి - ప్రదీప్ ప్లాన్.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఈవెంట్ల హవా కొనసాగుతోంది.పండగ వస్తే చాలు ప్రతి ఛానల్ లోనూ ఏదో ఒక ఈవెంట్ ప్రసారమవుతోంది.

మొన్న దసరా పండుగ సందర్భంగా ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు, మాటీవీలో జాతరో జాతర, జీ తెలుగులో చి ప్రదీప్ చి ల సౌ శ్రీముఖి పేరుతో ప్రసారమయ్యాయి.ఈ మూడు షోలలో అక్కా ఎవరే అతగాడు, జాతరో జాతర ప్రోగ్రాంలు సూపర్ హిట్ కాగా చి ప్రదీప్ చి ల సౌ శ్రీముఖి మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.

గతంలో ఈటీవీ ఛానల్ లో సుధీర్ రష్మీ పెళ్లి అంటూ ఒక ఈవెంట్ ప్రసారం కాగా ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో జీ తెలుగు సైతం అదే తరహా ఈవెంట్ ను ప్లాన్ చేసింది.అయితే సుధీర్ కు రష్మీకి మధ్య ఏదో ఉందని గాసిప్స్ ఉండటంతో ఆ ఈవెంట్ పై ఆసక్తి చూపిన ప్రేక్షకులు, ప్రదీప్ శ్రీముఖి పెళ్లి అంటూ ఒక శుభలేఖను వైరల్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు.ఫలితంగా ఈ ఈవెంట్ కు కేవలం 3.50 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.మాటీవీ జాతరో జాతరకు 11.34 రేటింగ్ రాగా ఈటీవీ అక్కా ఎవరే అతగాడుకు 7.98 రేటింగ్ వచ్చింది.మొత్తానికి శ్రీముఖి ప్రదీప్ తో కలిసి ఈవెంట్ ను హిట్ చేద్దామని భావించిన నిర్వాహకుల ప్లాన్ మాత్రం బెడిసికొట్టింది.

అయితే ఈ ఈవెంట్ ఘోర పరాజయానికి మరో కారణం కూడా ఉంది.సాధారణంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లు రాత్రి 9 నుంచి ప్రసారమవుతాయి.అయితే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లడంతో ఏకంగా షో నిర్వాహకులు సమంత హోస్ట్ గా మూడున్నర గంటల పాటు షోను ప్రసారం చేశారు.

Advertisement

చి ప్రదీప్ చి ల సౌ శ్రీముఖి, బిగ్ బాస్ దాదాపు ఒకే సమయంలో ప్రసారం కాగా సమంత బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో జీ తెలుగు షో రేటింగులు తగ్గడం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు