ఫ్యాన్స్ ను మళ్లీ నిరాశపరుస్తున్న ప్రభాస్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే పలు సినిమాలలో షూటింగ్ లో నటిస్తుండగా మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ మళ్లీ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు ప్రభాస్.కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ టి సిరీస్ నిర్మాణంలో గోపి కృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.రొమాంటిక్ పీరియాడికల్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంగా రూపొందుతోందని తెలుస్తోంది.

Advertisement

ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ చివరగా నటించిన సాహో తర్వాత మళ్లీ ఏ సినిమాలు తెరపైకి రాలేవు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు.

కోవిడ్ కారణంగా వాయిదా పడుతూనే ఉంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమాతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తుండగా ఈ సినిమాల అప్ డేట్ లు మాత్రం బాగా వస్తున్నాయి.ఇక రాధేశ్యామ్ ప్రమోషన్స్ అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఒకవేళ అప్పుడు కూడా కోవిడ్ ప్రభావం ఉంటే మాత్రం విడుదల డేట్ మారుతుందని తెలిపారు.ఇక ఈ సినిమా తర్వాతనే సలార్, ఆది పురుష్ సినిమాలు విడుదల కానున్నాయని గతంలో తెలిపారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మొత్తానికి ఒకటే ఏడాదిలో మూడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్.

Advertisement

తాజా వార్తలు