పవన్ ఎలాంటివాడో చెప్పిన పోతుల సునీత 

జనసేన పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసే క్రమంలో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.

రాజకీయం, వ్యక్తిగత జీవితం వేరు వేరు అయినా.

పదే పదే వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశంపైనా పదేపదే రాజకీయ విమర్శలు వస్తూ ఉంటాయి.

తాజాగా వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పోతుల సునీత పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.      మహిళలను వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్ ది.ముగ్గురుని పెళ్లి చేసుకుని వదిలేసి వారి జీవితాలతో చెలగాటమాడారు అంటూ ఆమె మండిపడ్డారు.వ్యక్తిగత జీవితంలో మహిళలను గౌరవించని నీకు.

మహిళల భద్రత, రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.పవన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే మహిళలకు ఆయన ఏమాత్రం గౌరవిస్తారో అర్థమవుతుందని, ఒకరు లోకల్ , మరొకరు నేషనల్ , ఇంకొకరు ఇంటర్నేషనల్.

Advertisement

ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందని విమర్శించారు.   

కీచకుడు, దుశ్శాసనుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే అలాగే ఉంటుందని, పవన్ కళ్యాణ్ దగ్గరే మహిళలకు రక్షణ లేదని విమర్శించారు.పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి తల్లితండ్రులు, టీచర్లు అవగాహన కల్పించాలని హోం మంత్రిని మాట్లాడిన మాటలను పవన్ వక్రీకరించారని మండిపడ్డారు.

గత టిడిపి ప్రభుత్వంతో పవన్ కలిసి పనిచేశారని, అప్పుడు కాల్ మనీ, సెక్స్ రాకెట్  , ఎమ్మార్వో వనజాక్షి పై దాడి వంటి ఎన్నో అవమానియా సంఘటనలు జరిగినా పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అని పోతుల సునీత ప్రశ్నించారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు