డబ్బు కోసం ఆల్కాహాల్‌ ప్రమోషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

ఈమద్య కాలంలో సెల్రబెటీలకు నాలుగు వైపుల నుండి డబ్బులు వస్తున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో నటిస్తే మాత్రమే డబ్బులు వచ్చేవి.

కాని ఇప్పుడు మాత్రం అనేక రకాలుగా డబ్బులు వస్తున్నాయి.సెల్రబెటీలకు ఉన్న క్రేజ్‌ను బట్టి సైడ్‌ మనీ వస్తుంది.

కొంత మంది స్టార్స్‌ సినిమాలతో కాకుండా ఎక్కువగా ఇతర మార్గాల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నారు.ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్న వారు భారీగా సంపాదిస్తున్నారు.

మిలియన్స్‌ లో ఫాలోవర్స్‌ ఉన్న వారు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.ఒక్క పోస్ట్‌ కు లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారు.

Advertisement

ఈమద్య కాలంలో సెలబ్రెటీలు తమ సోషల్‌ మీడియా పేజీల్లో ఏదో ఒక కంపెనీకి చెందిన బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు.తాజాగా హీరోయిన్‌ పూజా హెగ్డే ఒక ఆల్కహాల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌ లో దాదాపు 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే తాజాగా తన తండ్రితో ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేసింది.అందులో పూజా తండ్రి లిక్కర్‌ తాగుతున్నట్లుగా చూపించారు.

తాను మరోసారి వంట చేసే వ్యక్తిగా మారాను.ఈసారి నాన్న కోసం ఒక మంచి స్నాక్స్‌ ను చేశానంటూ పోస్ట్‌ చేసింది.

ఆమె పోస్ట్‌ లో ఎక్కడ కూడా లిక్కర్‌ పేరును చెప్పలేదు.కాని ఆమె షేర్‌ చేసిన ఫొటోలో మాత్రం ఆమె తండ్రి రెడ్‌ లెబుల్‌ తాగుతున్నట్లుగా క్లీయర్‌గా చూపించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

పేరు కనిపించేలా అంతగా చూపించారు కనుక ఖచ్చితంగా అది ప్రమోషన్‌ కోసమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటున్నారు.మీరు షేర్‌ చేసింది ఖచ్చితంగా ప్రమోట్‌ పిక్చర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలా మంది కూడా డబ్బులు తీసుకుని పోస్ట్‌ చేస్తారు.అది తప్పు లేదు కాని ఇలాంటి లిక్కర్‌ ప్రమోట్‌ ఏమాత్రం కరెక్ట్‌ కాదని అంటున్నారు.

మరి ఈ విమర్శలకు పూజా హెగ్డే ఎలా రియాక్ట్‌ అవ్వనుంది అనేది చూడాలి.

తాజా వార్తలు