కేసీఆర్‎వి దిగజారుడు రాజకీయాలు..: మాజీమంత్రి జూపల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అవినీతి, అక్రమాలతో కేసీఆర్ రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని జూపల్లి విమర్శించారు.

ఈ క్రమంలో అధికార పార్టీలోకి వెళ్లిన వాళ్లు అమ్ముడుపోతున్నట్లేనని పేర్కొన్నారు.అమ్ముడుపోయిన నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానీయొద్దని సూచించారు.

ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందన్న జూపల్లి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని వెల్లడించారు.

Advertisement
మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!

తాజా వార్తలు