కర్నూలు జిల్లా నంద్యాల వైసీపీ రాజకీయాలు చిత్రంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తన దారిలో తాను వ్యవహరిస్తున్నారు.
తన నియోకవర్గం పరిధిలో తాను సొంతగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.ఇక, కూడా తనదైన శైలిలో వ్యవహారాలు నిర్వహిస్తున్నారనే టాక్ వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
వలంటీర్లను నియమించడం నుంచి.కొన్ని కొన్ని కాంట్రాక్టు వర్కులను తన వారికి ఇప్పించుకునే విషయం వరకు శిల్పా దూకుడుగా ఉన్నారనేది ఇటీవల పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన శిల్పా రవిచంద్ర పలు విషయాల్లో జోక్యం పెరిగిందనే ఫిర్యాదు లు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఓ కుటుంబం.తమకు దక్కిన విద్యుత్ బిల్లులు తీసే కాంట్రాక్టును రవిచంద్ర.తన వారికి కట్టెబట్టారని ఈ క్రమంలో ఆయన కొంత సొమ్ముతీసుకున్నారని ఆరోపిస్తూ.
ఆత్మ హత్య చేసుకునేందుకు తాము సిద్ధమని పేర్కొంటూ.ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఇక, వలంటీర్ల విషయం కూడా తమపై నేతల ఒత్తిడి ఉందని, తమకు సంబంధం లేని పనులు కూడా చేయ మంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు.ఇలా ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పైస్థాయిలో తనదైన చక్రం తిప్పుతున్నారని వైసీపీ నాయకులే ఆరోపిస్తున్నారు.ఆయన దూకుడు కారణంగా.కొందరు ఎమ్మెల్యేలు కూడా మౌనం వహించాల్సి వస్తోందని చెబుతున్నారు.నంద్యాల-కర్నూలు ప్రధాన రోడ్డు విస్తరణ పనుల విషయంలో తనవారికి మాత్రమే ఆయన అవకాశం ఇప్పించుకున్నారని ఇటీవల కాలంలో టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
ఇక, ప్రతిపక్షం నేతలపై పనిగట్టుకుని కేసులు పెట్టిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.ఇలా.అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఇద్దరూ కూడా తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.ఫలితంగా పార్టీలో ఐక్యత దెబ్బతిని అంతిమంగా ప్రజల్లో పార్టీ చులకన అవుతోందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.