Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. కస్టడీకి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు,( Bhujanga Rao ) తిరుపతన్నను( Tirupatanna ) పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు.

 Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. క-TeluguStop.com

కాగా ఈ కేసులో వీరిద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు( Nampally Court ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదేవిధంగా ప్రణీత్ రావును మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయస్థానం నిరాకరించింది.

ఈ క్రమంలోనే ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది.ఈ క్రమంలోనే రాధాకిషన్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

కాగా రాధాకిషన్ రావుతో పాటు గట్టుమల్లును నిన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ అర్థరాత్రి వరకు ప్రశ్నించారు.కాగా ఈ కేసులో పలువురు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబీ సిబ్బంది బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube