మండల సమస్యలపై ఎమ్మెల్సీకి వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలంలో నెలకొన్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించాలని కోరుతూ బుధవారం బొమ్మల రామారం వచ్చిన టీచర్ ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు మైలారం జంగయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలో మూతబడిన బీసీ హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించి, గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని, ఎయిమ్స్ కాలేజీ హాస్టల్ మంజూరై చాలా రోజుల గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఆగిపోయిందన్నారు.

 Petition To Mlc On Bommalaramaram Mandal Issues, Petition ,mlc ,bommalaramaram M-TeluguStop.com

అలాగే స్టోన్ క్రషర్ల బ్లాస్టింగ్ ధాటికి గ్రామాల్లో ఇండ్లు పర్రెలు బట్టి లక్షలాది రూపాయలు పేదలు నష్టపోయారని,బొమ్మల రామారంలో పోలీస్ సర్కిల్ ను ఏర్పాటు చేయించాలని,తొందరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో కనీస వేతనం రూ.20వేలు చేసి,గుడ్లు, సరుకులు ప్రభుత్వమే సరఫరా చేసి,ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, కస్తూరిబా,మోడల్ స్కూల్ హాస్టల్ లో సెక్యూరిటీ కల్పించాలన్నారు.మండల కేంద్రంలో ఇయస్ఐ డిస్పెన్సరీ,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, మండల కేంద్రం చీకటి మామిడిలో సామూహిక మూత్ర శాలలు ఏర్పాటు చేయించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube