నల్లగొండ జిల్లా: భర్తతో గొడవ పడి భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఘటన భర్త బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.నల్లగొండ జిల్లా గుర్రంపొడ్ మండలం తేనేపల్లి గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ భార్య సుభద్ర (32) ఈ నెల ఒకటో తేదీన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
దీంతో భర్త కిరణ్ తన భార్య బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటుందని భావించాడు.కానీ,ఇరవై రోజులైనా రాకపోవడంతో బంధువుల వద్ద కూడా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన ఎస్సై శివ ప్రసాద్ విచారణ చేస్తున్నట్లు తెలిపారు.