రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా పయ్యావుల కేశవ్..

ఏ సమస్యలేనట్టు సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారు.రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయి.

వాటి గురించి ఎందుకు చర్చించడం లేదు.మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడ్డం మానేశారు.

పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగింది.కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారు.

కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు.అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పీఏసీ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

తాజా వార్తలు