పవన్ చేసిన వ్యాఖ్యలు నిజం.. అంటున్న టీడీపీ మాజీ మంత్రి..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి శ్రమధానం కార్యక్రమంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.వైసీపీ పాలన వల్ల రెడ్ల సామాజిక వర్గంకి చెందినవారు అవమానంగా ఫీల్ అవుతున్నారని.

 Pawan Kalyan Remarks On Ycp Are True Says Tdp Ex Minister, Tdp Ex Minister Somi-TeluguStop.com

వాళ్లే తన దగ్గర ఈ వ్యాఖ్యలు చేసినట్లు పవన్ ఈ సభలో పేర్కొన్నారు.ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నో ఆశలతో జగన్ ని నెత్తిన పెట్టుకున్న రెడ్లు ఇప్పుడు.బాధపడుతున్నారని పేర్కొన్నారు.

జగన్ పరిపాలన వలన.రెడ్ల సామాజిక వర్గం భ్రష్టుపట్టి పోయిందని.ఆరోపించారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టడం తప్ప.చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలకు ఆకృత్యాలకు ఎంతో మంది రెడ్లు బలై పోతున్నారని.

సోమి రెడ్డి స్పష్టం చేశారు.దళితులు అదే రీతిలో బిసి ఇంకా మైనార్టీ ప్రజలు ఇంకా అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు వైసీపీ నేతల దుర్మార్గులతో.

అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.పొలాలతో ఎటువంటి సంబంధం లేకుండా జగన్.

అనేకమందిని ఇబ్బందులపాలు చేస్తున్నారని.పవన్ చెప్పినట్టు రెడ్లు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్లకి కూడా మినహాయింపు లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube