పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో ”హరిహర వీరమల్లు” ఒకటి.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.ఈ సినిమా షూట్ ఇప్పటికే 70 శాతానికి పైగానే పూర్తి అయ్యింది.ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ షూట్ కు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూట్ ఆగిపోయింది.
మరి ఈ సినిమాను ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం విశేషం.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది.
ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.సినీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కూడా ఒక ఫ్రాంచైజ్ లాగా రాబోతుందట.
ఇదే నిజమైతే హరిహర వీరమల్లు సినిమా రెండు పార్టులుగా వచ్చే అవకాశం ఉంది.
దీనిపై అధికారిక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం తెలియదు.మరి ఈ సినిమా రెండు భాగాలూ అంటే మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది.మరి క్రిష్ ఎప్పుడు పూర్తి చేస్తాడో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.మరి పవన్ కళ్యాణ్ వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తారో ఆయనకే తెలియాలి.