పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్! క్రిష్ మూవీ నుంచి కొత్త అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే క్రిష్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలుపెడతాడు.

ఏ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన పవన్ కళ్యాణ్ లుక్స్ బయటకి వచ్చిన సినిమా మీద ఇంటెన్సన్ పెంచుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్టమొదటి సారి చేస్తున్న పీరియాడికల్ మూవీ ఇది కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ తాజాగా బయటకి వచ్చింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని చర్చించుకుంటున్నారు.

Advertisement

గతంలో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో రెండు పాత్రలు చేసిన అందులో రెండు కథలు నడుస్తూ ఉంటాయి.ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు.అయితే ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు పాత్రలు ఒకే కథలో ఉంటాయని, అందులో ఒక పాత్రలో దొంగగా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.

ఇక ఈ కథపై పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ లో క్రిష్ తో చర్చలు నడుపుతున్నాడని తెలుస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు తెలియదు.

Advertisement

తాజా వార్తలు