నేను అడిగితే మోదీ,చంద్రబాబు పదవి ఇచ్చేవారు ! .. పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ డైలాగులకు మరింత పదును పెట్టాడు.

తన ప్రత్యర్థులను గురించి ప్రస్తుత రాజకీయాల గురించి హాట్ హాట్ గా మాట్లాడారు.

తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అంటూనే.పోరాటానికి నేను సిద్ధం.

మీరు సిద్ధమేనా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులను అడిగితే నాకు పదవి ఇచ్చేవారు, కానీ నేను సమాజంలో మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని ప్రసంగించారు.

గుంటూరు జిల్లా పెదరావూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.2019 మన భావజాలానికి పరీక్షా సమయం.ఆలోచించుకోండి.

Advertisement

ఒక్క అడుగు వేశాను.పది అడుగులు తోడయ్యాయి.

ఇంకో అడుగువేద్దాం.సోషల్ మీడియాలో కనిపించకుండా తిట్టుకోవడం కాదు.

వాట్సాప్‌లలో మాట్లాడటం కాదు.బయటకు వచ్చి మాట్లాడు.

అప్పుడు తెలుస్తుంది.భోగిమంటల సాక్షిగా పిరికితనాన్ని కాల్చేద్దాం.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

అవినీతిని దహించేద్దాం.సరికొత్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు