ఈ సంవత్సరం ఆసియా కప్( Asia Cup ) నిర్వహణకు పాకిస్తాన్ అథిత్యం ఇస్తున్న క్రమంలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ICC), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పలుమార్లు పాకిస్తాన్ బోర్డుతో చర్చలు నిర్వహించిన సంగతి కూడా తెలిసింది.
ఇక ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీంతో ఆసియా కప్ 2023 పాకిస్తాన్ నుండి తరలి వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడోచ్చు.అడకపోవచ్చు.
ఎందుకంటే ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించాలని ఏసీసీ అనుకుంటున్నట్లు సమాచారం.ఒకవేళ ఇలా జరిగితే పాకిస్తాన్ టోర్నీలో పాల్గొనాలంటే శ్రీలంకకు రావాల్సిందే.ఒకవేళ శ్రీలంకకు రాకపోతే టోర్నీ నుంచి తప్పుకున్నట్టే.ఆసియా కప్ పాకిస్తాన్లో నిర్వహిస్తే.పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని బీసీసీఐ ( BCCI ) స్పష్టంగా తెలిపింది.దీనికి గల కారణాలు అందరికీ తెలిసిందే.
ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ టోర్నీలో పాల్గొనాలంటే పాకిస్తాన్లో కాకుండా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని ఏసీసీ కు తెలిపింది.
ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా భారత్ ఆసియా కప్ టోర్నీ నుండి తప్పుకుంటుందని నిర్ణయాన్ని ప్రకటించింది.అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్లో ఉండే సభ్య దేశాలు పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్లు, తటస్థ వేదికలపై కొన్ని మ్యాచ్లు జరపడాన్ని తిరస్కరించినట్లు తెలుస్తుంది.అదే ఈ టోర్నీ అన్ని మ్యాచులు శ్రీలంకలో నిర్వహిస్తే బాగుంటుందని సభ్య దేశాలు కూడా ఈ విషయంలో అనుకూలంగా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఆసియా కౌన్సిల్లో ఉండే సభ్య దేశాలు తమ నిర్ణయాలను కౌన్సిల్ కు తెలిపినట్లు సమాచారం.ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
మొత్తానికి పాకిస్తాన్ నుండి ఆసియా కప్ టోర్నీ మరో దేశానికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.