తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ఈ మధ్యకాలంలో సినిమాలలో అంతగా కనిపించడం లేదు.
సినిమాలలో కనిపించకపోయినప్పటికీ పొలిటికల్ గా మాత్రం యాక్టివ్ గా ఉంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలు నిలుస్తూ ఉన్నాడు.అయితే గత ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం ఆపరేషన్ గరుడ అంటూ అలజడి రేపిన శివాజీ ఈ మధ్యకాలంలో కనిపించడం మానేశారు.
కాగా ఇప్పుడు ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ గా మారాడు శివాజీ.ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒక మీటింగ్ లో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ.
తాను ఇప్పటివరకూ ఏపీలోని 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించానని అధికార పార్టీకి ఏమీ లేదంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో గట్టెక్కుతారని జోస్యం చెప్పారు శివాజీ.అయితే శివాజీ ఏ పార్టీలో ఉన్నారు అన్న విషయం స్పష్టంగా చెప్పలేదు కానీ.
అధికారం రావడంలోకి మాత్రం పక్క వచ్చిన తర్వాత పిచ్చ కొట్టుడు కొడతాం అంటూ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. శివాజీ మాటలకు కేకలు పెట్టి చప్పట్లు కొట్టుతుండడంతో శివాజీ మరింత రెచ్చిపోయి మాట్లాడాడు.
మాపై కేసులు పెడుతున్నారు.ఏం చేశాం అని కేసులు పెడుతున్నారు.
కేసులు పెడితే ఏమౌతుంది.మహా అయితే నాలుగేళ్లు తిరుగుతారు.
ఆ తరువాత నిజం ఏంటో తేలుతుంది కదా.నిజంగా తప్పు ఉంటే లోపల వేస్తారు.
అయితే వీటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు ? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి.జగన్ మోహన్ రెడ్డిగారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను .మీరు పరిపాలన చేయమంటే.జనం పై ఎగబడుతున్నారు.
ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మూల.పోలీసులో.మీ పార్టీ నాయకులో.ఎవరొకరు జనసేన మీదనో.టీడీపీ మీదనో.నాలాంటి వాళ్లపై దాడి చేస్తున్నారు అంటూ వైసీపీ పై విమర్శలు గుప్పించాడు.
కొడితే చచ్చిపోయేట్టు కొట్టండి.బతికితే మాత్రం నా*ల్లారా ఎవరూ బతకరని చెప్తున్నాను అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు శివాజీ.
మమ్మల్ని ఎలా పుట్టించారో మిమ్మల్నీ అలాగే పుట్టించాడు దేవుడు.మీకే ఎక్స్ ట్రా కొమ్ములు లేవు.
మీ వెనుక మహా అయితే పోలీసులు ఉంటారు.అయితే రేపు మేము అధికారంలోకి వచ్చిన తరువాత అదే పోలీసులు మా దగ్గరకు రారా? మేం కొట్టించలేమా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు శివాజీ.