తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతూ తాజాగా 1434 ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది. 2017 అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ సీరియల్ గత ఐదేళ్లుగా స్టార్ మా లో ప్రసారం అవుతూ నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతూ టిఆర్పి రేటింగ్ ను కొల్లగొడుతోంది.
ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఉంది.డాక్టర్ బాబు వంటలక్క వస్తున్నారు అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి సరే టీవీల ముందు అతుక్కుపోతూ ఉంటారు.
కాగా ఇప్పటివరకు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు వెండితెరపై కూడా వెలుగులు పూయించడానికి రెడీ అయింది.
వెండితెరపై కార్తీకదీపం సీరియల్ ఏంటా అని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే.
కార్తీకదీపం సీరియల్ ఒక సినిమాగా రాబోతుంది అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.మరి ముఖ్యంగా వంటలక్క డాక్టర్ బాబు ప్రేక్షకులలో ఈ వార్త ఉత్సాహన్ని నింపుతోంది.
తెలుగు టెలివిజన్ పై సీరియల్స్ అన్ని ఒక వైపు అయితే కార్తీకదీపం సీరియల్ మరొకవైపు అన్నట్టుగా సరికొత్త రికార్డులను సృష్టించింది.అంతేకాకుండా జాతీయస్థాయిలో నెంబర్ వన్ రేటింగ్ తో ఐదేళ్లుగా ప్రసారమవుతూనే ఉంది.
అయితే ఎన్ని సీరియల్స్ వచ్చినప్పటికీ కార్తీకదీపం సీరియల్ మాత్రం నెంబర్ వన్ స్థానంలో పదిలంగా అలాగే ఉంది.అయితే ఇప్పటివరకు బుల్లితెరపై రికార్డులను సృష్టించిన కార్తీకదీపం ఇప్పుడు సినిమా గా మారి సరికొత్త చరిత్రగా నాంది పలకబోతోంది.కార్తీకదీపం సీరియల్ లోని పలు సన్నివేశాలను వివిధ భాగాలుగా సినిమా రూపంలో విడుదల చేయబోతున్నారట.అయితే కార్తీకదీపం సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుండగా, కార్తీకదీపం సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫిక్స్ లో ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మొదట థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేసి ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారట.అయితే ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వివరాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.