మహారాష్ట్ర నాగ్‎పూర్ లో  బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ పలు రాష్ట్రాల్లో విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలను నిర్వహించిన గులాబీ బాస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

నాగ్‎పూర్ లో ని గాంధీబాగ్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఇప్పటికే ఢిల్లీ, ఏపీలో పార్టీ శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది.

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో నాగ్‎పూర్  పట్టణం అంతా గులాబీమయంగా మారింది.ఇదే తరహాలో త్వరలోనే ముంబై,పూణేతో పాటు ఔరంగాబాద్ మరియు నాందేడ్ లో కార్యాలయాలను ప్రారంభించనున్నారు.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

తాజా వార్తలు