బాసర దేవాలయంలో ఆన్ లైన్ సేవలు..

బాసర సరస్వతి అమ్మ వారి దేవాలయంలో ఇ హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి( MLA Vithal Reddy ) మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దశల వారీగా ఆన్ లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి సౌకర్యాల కోసం ప్రధాన దేవాలయాలలో కూడా ఆన్ లైన్ లో పూజలు, వసతి, బుకింగ్, ప్రసాదం పంపిణీ తదితర సేవలను భక్తులకు అందుబాటులో తెచ్చామని వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే ఆన్ లైన్ సేవల వల్ల అమ్మవారి సేవలను భక్తులు పారదర్శకంగా, సులభంగా పొందుతున్నారని వెల్లడించారు.

భక్తులు సేవలు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి బాసరలో ఆన్ లైన్ సేవలు భక్తులకు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

Online Services In Basara Temple , Basara Temple ,indrakaran Reddy,saraswati De

అదే విధంగా ఇ హుండీ సేవలను కూడా భక్తులకు అందుబాటులోకి తెస్తామని డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగి నందు వల్ల భక్తుల సౌకర్యార్థం ఇ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు.పేటీఎం, ఫోన్ పే, జిపి ఇలాంటి యూపీఐ లను హుండీ కానుకను కూడా చెల్లించవచ్చని వెల్లడించారు.ఆ తర్వాత దివిస్ లాబొరేటరీస్ సంస్థ ఏర్పాటు చేసిన శుద్ధ జల ప్లాంట్‌లను మంత్రి గారు ప్రారంభించారు.

Online Services In Basara Temple , Basara Temple ,indrakaran Reddy,saraswati De
Advertisement
Online Services In Basara Temple , Basara Temple ,Indrakaran Reddy,Saraswati De

అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సరస్వతీ అమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు కూడా చేశారు.మంత్రికి దేవాలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.మంత్రి వెంట దేవాలయ ఈవో విజయ రామారావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు