ఐఎంఎఫ్ ఆంక్షలపై మాజీ ప్రధాని కుమార్తె ఆవేదన..

పాకిస్థాన్ ( Pakistan ) ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.అక్కడ ఆహారం కోసం కూడా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుండి దేశం చాలా ముఖ్యమైన మొత్తం 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం పాకిస్తాన్ ఎదురు చూస్తోంది.అయితే ఐఎంఎఫ్ మాత్రం పలు కఠిన ఆంక్షలు పెడుతోంది.దీనిపై పాక్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.ఐఎంఎఫ్ ఆంక్షలపై పిఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ మండిపడ్డారు.తమ దేశాన్ని ఐఎంఎఫ్ ఒక వలస దేశం మాదిరిగా చూస్తోందని వాపోయింది.

 Pakistan Former Prime Minister Nawaz Sharif Daughter Maryam Nawaz Laments Over I-TeluguStop.com

లాహోర్ మోడల్ టౌన్ వద్ద యువత మరియు సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మరియం నవాజ్( Maryam Nawaz ) సోమవారం ప్రసంగించారు, “IMF మమ్మల్ని విశ్వసించడానికి సిద్ధంగా లేదు.పాకిస్తాన్ IMF బందీ. పాకిస్థాన్‌ను అది వలస దేశంగా పరిగణిస్తోంది.మేము దాని బారి నుండి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ పని చేయలేకపోతున్నాం” అని పేర్కొంది.ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) అనుసరించిన ఆర్థిక విధానాలే అని ఆమె తెలిపింది.

అతడి చర్యల వల్లే ప్రస్తుతం ఐఎంఎఫ్ నుంచి 1.1 బిలియన్ డాలర్ల కోసం పాక్ ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వివరించింది.పాకిస్తాన్‌ను డిఫాల్ట్ అంచున నెట్టాడని ఆమె ఆరోుపించింది.

ఇమ్రాన్‌ను అరెస్టు చేయాలని ఆమె అన్నారు.అతను పార్టీ కార్మికుల దాక్కున్నాడని, మరోసారి ప్రధాని అవ్వాలని ఆశతో ఉన్నాడని విమర్శించారు.

గతంలో ప్రధానిగా దేశాన్ని దివాళా తీయించి, మరోసారి ప్రధాని పదవి చేపడతారా అని ప్రశ్నించింది.ఇమ్రాన్ ఖాన్ ఆర్మీలోని కొంతమంది జనరల్స్, కొందరు జడ్జిల సపోర్ట్ తీసుకుని, అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు ఆమె ఆరోపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube