పూరి జగన్నాథ్ ని దారుణంగా మోసం చేసిన ఎన్టీఆర్ ?

సినిమా ఇండస్ట్రీలో ఐడియాలు చోరి చేయడం ఎప్పటినుంచో జరుగుతోంది.అదేమీ కొత్త విషయం కాదు, అలాగే వింత విషయం కాదు.

కాని మామూలుగానైతే ఎవరైనా చిన్న రైటర్ స్టోరిని పెద్దవారు డబ్బు చేల్లిచాకుండా కొట్టేయడం జరుగుతుంది.కాని ఇక్కడ పూరి జగన్నాథ్ ఐడియానే దొంగాలించారట.

అది కూడా ఎవరో కాదు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చోరి చేసాడని, పూరిని మోసం చేసాడని, విషయం బయటకి చెప్పకపోయినా, ఎన్టీఆర్ చేసిన పని పూరిని బాధించిందని పూరి క్యాంప్ లోని ఓ వ్యక్తీ చెప్పినట్లు ఓ నేషనల్ దినపత్రిక చెప్పుకొచ్చింది.మీకు తెలిసిన విషయమే, జనతా గ్యారేజ్ తరువాత పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్.

మొదట టెంపర్ లాంటి సినిమా ఇచ్చినందుకు పూరికి మరో అవకాశం ఇద్దామనుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో తీసిన ఇజం ఫలితం చూసి ఆలోచన మార్చుకున్నాడు.పూరిని కాదని బాబి డైరెక్షన్ లో సినిమా మొదలుపెట్టాడు.

Advertisement

అయితే ఎన్టీఆర్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు పూరి మన యంగ్ టైగర్ కి ఒక అద్భుతమైన ఐడియా చెప్పాడట.ఒక రావణుడి భక్తుడు, చాలా క్రూరమైన వాడు, కాని అతడి శారీరక దృఢత్వానికి భిన్నంగా నత్తి ఉంటుంది .ఇది పూరి జగన్నాథ్ చెప్పిన ఐడియా అంట.అదే ఐడియాని ఎన్టీఆర్ ఇటువైపు బాబికి చెబితే, "జై లవ కుశ" లో జై క్యారక్టర్ ని అచ్చం అలాగే డిజైన్ చేసారని, పూరికి కనీసం సమాచారం అందించకుండా ఇలా ఆయన ఐడియాని తస్కరించారని పూరి దగ్గరి వ్యక్తీ ఒకరు చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది.అయితే డైరెక్టర్ బాబి మాత్రం ఈ వార్తల్ని ఖండించాడు.

కథలో రాయడం మొదలుపెట్టినప్పుడే జై క్యారక్టర్ ని అలానే డిజైన్ చేసామని, ఇది ఎవరో చెప్పిన ఐడియా కాదని క్లారిటి ఇచ్చారు.ఈ వార్తలపై పూరి జగన్నాథ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

ఆయన మాట్లాడేవరకు నిజానిజాలపై క్లారిటి రాదు.

మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

Advertisement

తాజా వార్తలు