హీరోయిన్‌, ఫ్యాన్స్‌ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రెడీ అయిన టీం

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు అంటూ హీరోయిన్‌ మీరా చోప్రా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

ఒక లైవ్‌ చాట్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఎవరో నాకు తెలియదు అంటూ మీరా చోప్రా వ్యాఖ్యలు చేసింది.

అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ గొప్ప మానవతా వాది మరియు మహేష్‌బాబు తన అభిమాన హీరో అంటూ చెప్పుకొచ్చింది.దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు.

ఆమెపై సోషల్‌ మీడియాలో దాడి చేస్తున్నారు.రెండు రోజుల పాటు ఆమెను తీవ్రంగా వేదించడంతో ఆమె బాధ బరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదే సమయంలో ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేసి మీ అభిమానులను కనీసం అదుపులో పెట్టుకోలేరా అంటూ పోస్ట్‌ పెట్టింది.ఈ విషయంలో ఎన్టీఆర్‌ పరువు పోతుందని గ్రహించిన ఆయన పీఆర్‌ టీం రంగంలోకి దిగింది.

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్‌ పీఆర్‌ టీం మీరా చోప్రాతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాల్సిందిగా పీఆర్‌ టీం ఆమెను కోరడం జరిగింది.అభిమానులు చేసిన తప్పుకు సారీ చెప్పడంతో పాటు మరోసారి ఇలా జరగదంటూ హామీ ఇచ్చారట.కేసు వాపస్‌ తీసుకోవడంతో పాటు వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలంటూ ఆమెకు పీఆర్‌ టీం విజ్ఞప్తి చేశారట.

ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు